శుక్రవారం, జులై 18, 2014

కాశీ విశ్వనాథుడు

తురుష్కులు దండయాత్రకు వస్తున్నారని విని విశ్వనాథుని సేవించుకుంటున్న అర్చకులు, ఋషులూ అక్కడ విగ్రహానికి హాని కలుగకూడదని, ఇంకోచోట భద్రపరచే ఉద్దేశ్యముతో పెకలించబోయారు. కాని విశ్వనాథుడు కదలలేదు.. ఏంచేయాలో తెలియని భక్తులు "మా ప్రాణాలు తీసికాని స్వామిని ముట్టనివ్వ" మని ఆస్వామిని కౌగలించుకుని ఉండిపోతే.. అప్పుడు విగ్రహములో కదలిక వచ్చింది..

వెంటనే విగ్రాహాన్ని పెకలించి ప్రక్కనున్న నూతిలో దాచారు... తురుష్కులు వచ్చి ముట్టడించారు. చేయదలచిన
విధ్వంసం చేసి నిష్క్రమించారు.. ఆ తర్వాత పునః ప్రతిష్ట చేద్దామంటే స్వామి నూతిలో కనపడలేదు.

రాణీ అహల్యాబాయికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను ఆ కూపంలో ( అదే ఙ్ఞానవాపిగా చెప్పబడుతున్నది)
లుప్తమయ్యానని, గుడి కట్టించి ఇంకో లింగాన్ని ప్రతిష్ట చేయమని ఆదేశించాడట... ఆ ప్రకారం అన్నీ ఏర్పాటులు చేసి
లింగాన్ని తెచ్చి ఓ ప్రక్కగా పెట్టి గర్భగుడి మధ్యభాగంలో ప్రతిష్ట చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారుట.

అంతా అయ్యాక లింగప్రతిష్ట చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి ఆ స్వామి కదలలేదట.. ఆ స్థలమే తనకి ఇష్టమైనదని అక్కడే అలాగే దాన్ని ఉంచి అర్చించమని స్వప్నంలో అహల్యాబాయికి చెప్పాడట స్వామి. ఆ కారణంగా గర్భగుడిలో ఓ ప్రక్కకు ఉంటాడు విశ్వనాథుడు.. ముందుగా ప్రతిష్టింపబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు.

కాశీ విశ్వనాథుణ్ణి ఇక్కడ ఎవరైనా స్వయంగా అభిషేకించుకోవచ్చు.. భక్తుల అభిషేకజలాలతో తడిసిన అభిషేక ప్రియుడు తన శిరో భాగాన్ని మాత్రమే చూపుతూ ఉంటాడు.. అంతే ఆ విగ్రహమనుకునేరు.. కాని ఓ సారి ఆ నీరు అర్చకులు తీసేసినప్పుడు - ఓహ్!! పూర్తి స్వామి కన్నులపండువగా దర్శనమిస్తాడు... సుమారు 3అడుగుల సుందరమూర్తి....

కొంచెం దూరంగా అమ్మ విశాలాక్షి శోభాయమానంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట ఉండడం విశేషం....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి